చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని మొక్కుకున్న ఉప్పుమాగులూరు మాజీ సర్పంచ్ అమరనేని అంజనాదేవీ కాశీవిశ్వనాథం బుధవారం పాదయాత్రగా విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి బయలుదేరారు. టీడీపీ కూటమికి 144 సీట్లు రావాలని మూడు మసాల నుంచి కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న కాశీవిశ్వనాథం ఎన్నికల ఫలితాలలో టీడీపీకి భారీ మెజారిటీ రావడంతోపాటు అద్దంకి ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్ అయిదోసారి గెలుపొందడంతో ఉప్పుమాగులూరు గ్రామం నుంచి పాదయాత్రగా మొక్కులు తీర్చుకునేందుకు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి బయలుదేరారు. కార్యక్రమానికి గ్రామ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హజరై కాశీవిశ్వనాథంను గ్రామం దాటే వరకు సంఘీభావంగా పాదయాత్రగా వెళ్లి అయనకు అభినందనలు తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి అమ్మవారి దేవాలయానికి చేరి మొక్కు తీర్చుకుంటానని ఆయన తెలిపారు. ఆయనతోపాటు పలువురు టీడీపీ మహిళా కార్యకర్తలు పాదయాత్రగా తరలి వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa