వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ దాడుల నుంచి వైయస్ఆర్సీపీ కార్యకర్తలను కాపాడుకుంటామని వారు ధైర్యం చెప్పారు. టీడీపీ దాడులపై రాష్ట్రపతి, గవర్నర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. కళ్లేదుటే దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై వారు మండిపడ్డారు. శనివారం మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.... ఏపీ మరో బిహార్గా మారుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు మాపై దాడులకు పాల్పడుతున్నారు. వైయస్ఆర్సీపీ నేతల, కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారు. దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని కొడాలి నాని ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa