ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవదాయకమిషనర్ సత్యనారాయణ స్వయంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. కనకదుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణారావు కుటుంబసభ్యులు కలిసి దర్శించుకున్నారు. ఈవో రామారావు ఆలయ మర్యాదలు కల్పించగా.. అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదం, శేషవస్త్రం, ఆశీస్సులు అందచేశారు.మాజీమంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప, యనమల రామకృష్ణుడు, మండలి బుద్దప్రసాద్ తదితరులు దర్శించుకున్నారు. వీరిలో చిన్నరాజప్ప, మండలి బుద్ద ప్రసాద్లు తాజాగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలు అందజేశారు. వీరికి టీడీపీ బీసీ, మైనార్టీ నాయకుడు నాగుల్మీరా, కాండ్రేగుల రవీంద్రలు స్వాగతం పలికారు. ఆదివారం దుర్గమ్మ దర్శనార్థం వచ్చిన నూతన దంపతులకు అమ్మవారి కుంకుమ ప్రసాదం, ఆశీస్సులు అందజేశారు. ఆలయంలో అన్నవితరణకు విజయవాడ కానూరుకు చెందిన చిట్టూరి యఘ్నేశ్వర నారాయణ గుప్త, ఆయన కుటుంబసభ్యులు రూ. 1,01,116 విరాళం అధికారులకు చెక్కు రూపంలో అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa