ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరమ్మతుల దృష్ట్యా సత్యసాయి పైపులైన్ల సరఫరా నిలిపివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 11, 2024, 06:45 PM

పోలవరం నుంచి తూర్పుగోదావరి జిల్లా ఏలూరు జిల్లాల్లో 17 మండలాలకు నిత్యం తాగునీటిని పంపిణీ చేసే సత్యసాయి మంచినీటి పథకం పైపులైన్లకు కన్నాపురం అడ్డరోడ్డు నుంచి దొండపూడి వెళ్ళే రోడ్డు మార్గంలో నాలుగు చోట్ల మరమ్మతులకు గురి కావడంతో సోమవారం సత్యసాయి మంచినీటి సరఫరా నిలిపివేశారు. ఆ మార్గంలో భూగర్భం లోపల నుంచి ఏర్పాటు చేసిన పైపులైన్లు నీటి ఒత్తిడికి పలుచోట్ల పైపులైన్లు పగిలి లీకేజీలు జరుగుతున్న నేపథ్యంలో సత్యసాయి మంచినీటి పథకం నిర్వహణ చేస్తున్న కాంట్రాక్టరు టీవీవీ సత్యనారాయణ మంచినీటి సరఫరా నిలిపివేయించి పైపులైన్లు పగిలిన ప్రాంతాల్లో పైపులు కట్‌ చేయించి కొత్తపైపులు జతపరిచి వెల్డింగ్‌ పనులు చేయిస్తున్నారు. మంచినీటి సరఫరా పునరుద్ధరించడానికి రెండు రోజులు పడుతుందని సిబ్బంది తెలిపారు. ఈ కారణంగా గోపాలపురం, చింతల పూడి, కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం లైన్లలో సుమారు 13 మండలాల్లో 200 గ్రామా లకు పైగా మంచినీటి సరఫరా ఆగిపోయి ప్రజానీకం తాగునీటికి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎండల తీవ్రత తగ్గనే లేదు, ఈ సమయంలో మంచినీటి సరఫరా నిలిపివేస్తే ఆయా ప్రాంతాల ప్రజలు మంచినీటి ఇక్కట్లు తప్పవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa