ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృధే ద్యేయంగా ముందుకు సాగుతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 11, 2024, 06:47 PM

వాల్మీకిపురం మండలానికి పూర్వ వైభవం తీసుకువస్తామని వ్యవసాయ మా ర్కెట్‌ కమిటీ మాజీ చైర్మన కంభం నిరంజనరెడ్డి పేర్కొన్నారు. స్థానిక మార్కెట్‌ కార్యాలయం ఎదుట దివంగత మాజీ మంత్రి నల్లారి అమరనాథరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన చర్చించారు. ఈసందర్భంగా ఆయన పీలేరు కూటమి అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వాల్మీకిపు రం మండలంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం తమ అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడమే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ప్రథమ కర్తవ్యమన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా వారి వెన్నంటే ఉండి పరిష్క రించడం జరుగుతుందన్నారు. కక్షలు, దౌర్జన్యాలకు కాకుండా అబివృదేఽ్ద ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, ఉపాధ్యక్షుడు బొక్కసం రామకృష్ణ, పీలేరు పార్టీ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌బాషా, జిల్లా ఎస్‌సీ సెల్‌ అధ్యక్షుడు వెంకటరమణ, నాయకులు పీవీ నారాయణ, రాజేంద్రాచారి, కోసూ రి రమేష్‌, చంద్రమౌళి, కువైట్‌ సయ్యద్‌బాషా,మురళి, అడ్వకేట్‌ రమణ, అనంద,డిష్‌ బ్రదర్స్‌, సైదు, కలందర్‌, గాంధీపేట రెడ్డి, రమేష్‌బాబు, సాంబ, జావీద్‌, శంకర్‌, గోవిందు, కేకే నాయుడు, మహ్మద్‌హుస్సేన తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa