అద్దంకి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ తొలుత పారిశ్రామికవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాలలోకి అడుగుపెట్టి 2004లో తన అన్న గొట్టిపాటి నరసయ్య పై మార్టూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. తదననంతరం మార్టూరు నియోజకవర్గం రద్దు అయిన తర్వాత 2009 లో అప్పటివరకు అద్దంకి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన జాగర్లమూడి రాఘవరావు ను ఒప్పించి రాజశేఖర్ రెడ్డి రవికుమార్ ను అద్దంకి తీసుకువచ్చారు. 2014లో జరిగిన ఎన్నికల్లో రవికుమార్ బలరాం పై గెలుపొందారు.
తర్వాత జరిగిన పరిణామాలలో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన కరణం వెంకటేష్ పై గెలుపొందారు. వైయస్సార్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కొంతకాలం తర్వాత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి వైసిపి అభ్యర్థి గరటయ్య పై గెలుపొందారు. వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చాక క్వారీలపై దాడులు జరిగినప్పటికీ ఆయన టిడిపిలోనే కొనసాగారు. 2024 జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన హనిమిరెడ్డి పై భారీ మెజార్టీతో గెలుపొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa