ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సీఎం హోదాలో ఉన్నప్పుడు తన నివాసాన్ని క్యాంప్ కార్యాలయంగా మార్చుకున్నారు.. అయితే ఆ క్యాంప్ ఆఫీస్లో ఫర్నీచర్ వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన ఫర్నీచర్ను మాజీ ముఖ్యమంత్రి ఇంకా ఉపయోగిస్తున్నారని కొత్త ప్రభుత్వం ఆరోపించింది.. తాము ఆ ఫర్నీచర్కు లెక్క కట్టి డబ్బులిస్తామని వైఎస్సార్సీపీ చెబుతోంది. ఆ తర్వాత జగన్ తాడేపల్లి నివాసం మీదుగా వెళ్లే రోడ్డులో కూడా ఆంక్షలు ఎత్తివేశారు.. ఆ రోడ్డులో నుంచి వాహనాలను అనుమితిస్తున్నారు. అయితే ఈ క్రమంలో జగన్ తాడేపల్లి నివాసం చుట్టూ ఏర్పాటు చేసి గ్రిల్స్ ఎపిసోడ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంటి చుట్టూ గ్రిల్స్ ఎందుకు ఏర్పాటు చేశారనే చర్చ జరుగుతోంది.
జగన్ నివాసం చుట్టూ గ్రిల్స్ ఎందుకు ఏర్పాటు చేశారో చెబుతూ కొందరు ట్వీట్ చేస్తున్నారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నారని.. దీనికి ఆనుకుని కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకుంటూ మరొక భవనం కూడా ఉంది అన్నారు. మొదట్లో ఈ రెండు భవనాల చుట్టూ ఎలాంటి గ్రిల్స్ లేవని.. అయితే ఏపీ ఎన్నికల సమయంలో జగన్పై హత్యాయత్నం జరగడంతో.. సెక్యూరిటీ అధికారులు కొన్ని సూచనలు చేసినట్లు చెబుతున్నారు.
తాడేపల్లిలో జగన్ నివాసం దిగువ దిగువ భాగంలో ఉందని.. దీనికి సమీపంలోనే ఎత్తైన భవనాలతో పాటుగా పక్కనే బకింగ్హామ్ కెనాల్ కాల్వ గట్టు ఎత్తులో ఉండడాన్ని అధికారులు గమనించారట. అందుకే జగన్ ఇంటి చుట్టూ ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సూచించారట. స్నైపర్ షాట్స్ను (దూరం నుంచి కూడా గన్తో కల్చగలిగేలా) నిలువరించే విధంగా ఇంటి చుట్టూ ఈ గ్రిల్స్ ఏర్పాటు చేశారని చెబుతున్నారు. జగన్ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుుతన్నారు.
అంతేకాదు తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. తన వ్యక్తిగత రక్షణ నిమిత్తం ఈ ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్నట్లు సమాచారం. విజయవాడలోని ఒక ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి 30 మంది సిబ్బందిని జగన్ నియమించుకున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లిలోని జగన్ ఇంటి దగ్గర ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది కనిపించారు. వీరంతా సఫారీ డ్రెస్సుల్లో.. మెయిన్ గేటు నుంచి లోపలికి వెళ్లారు.
తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర గతంలో ఉన్న పోలీసు సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండే భద్రత మాత్రమే ఉంది. అందుకే ఆయన ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటుచేసుకున్నట్లు సమాచారం. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అక్కడ ఆంక్షల్ని ఎత్తేసింది.. బారికేడ్లను కూడా తొలగించింది. ఇప్పుడు ఆ రోడ్డు ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు అందుబాటులోకి వచ్చిందని చెబుతున్నారు స్థానికులు. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు నుంచి ప్రజల రాకపోకలు మొదలయ్యాయి. కాబట్టి భద్రతా కారణాలతో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa