ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉన్నతవిద్యశాఖ అధికారులతో లోకేష్ సమీక్ష సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2024, 08:48 PM

పాత ఫీజు రీయింబర్స్ మెంట్‌పై విధివిధానాలు రూపొందించాలని విద్యాశాఖామంత్రి నారాలోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. విద్యాదీవెన, వసతి దీవెనకు సంబంధించి గత ప్రభుత్వం 3,480 కోట్లు బకాయిలు విధించిన సంగతి తెలిసిందే. బకాయి విడుదల చేయకపోవడంతో ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు ఉన్నాయి. గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. కాలేజీల్లో డ్రగ్స్ నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ల నియామకం అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నతవిద్యశాఖ పరిధిలో నెలకొన్న సమస్యలపై మంగళవారం మంత్రి లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa