ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధ్యాయులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2024, 09:01 AM

ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో బుధవారం నోబుల్‌ టీచర్స్‌ అసో సియేషన్‌ కాకినాడ జిల్లా సమావేశం జరిగింది. వర్మ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో పాటు అడుగడుగునా వేధించారని, కూటమి ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి ఉండదని తెలిపారు. ప్రభుత్వం అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తుందని చెప్పారు. అసోసియేషన్‌ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ చెరుకూరి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేసి సమస్యల పరిష్కారానికి ఐక్యం గా కృషి చేద్దామన్నారు. సంఘంలోని ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు, కాంట్రాక్టు లెక్చరర్లు, కేజీబీవీ వొకేషనల్‌, పార్ట్‌టైమ్‌ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని కోరదామని తెలిపారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. సంఘ గౌరవాధ్యక్షుడిగా కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, అధ్యక్షుడిగా తమ్మయ్య, ప్రదాన కార్యదర్శిగా వడగ సూరిబాబు, ఆర్థిక కార్యదర్శి గా ఎం.కొండలరావు, అసోసియేట్‌ అధ్యక్షులుగా స్వర్ణలత, వి.పేర్రాజు, ఉపాధ్యక్షులుగా కె.మోహన్‌, మేడిశెట్టి నాగరాజు, రాష్ట్ర కార్యదర్శిగా కసా రమణమూర్తి, ఎంటీఎస్‌, ఎంఐఎస్‌ కన్వీనర్లుగా కేజీకే చౌదరి, ఏ.బాలగణేష్‌ ఎన్నికయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa