ఏపీ సీఎం చంద్రబాబు పుంగనూరు వస్తే ఆయనపై దాడులు చేయించారని.. దమ్ము, ధైర్యంతో ఎదుర్కొన్న వ్యక్తి అని టీడీపీ నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ప్రజల కోసం పని చేసే మా నాయకుడికి భయం లేదన్నారు. దోచుకున్న మీకు భయం కాబట్టే పారిపోతున్నారన్నారు. నిన్న మిమ్మలను అడగడానికి వస్తే మిథున్ రెడ్డి రాళ్ల దాడి చేయించాడన్నారు. మీకు డబ్బు మీద అంత వ్యామోహం ఎందుకని మాజీ సీఎం జగన్ను బుద్దా వెంకన్న ప్రశ్నించారు. పెద్దిరెడ్డి కుటుంబానికి దోచుకోమని మైనింగ్ అప్పగించాడన్నారు. దొంగ చేతికి తాళ్లం ఇచ్చారు కాబట్టే ప్రజల సంపద దోచేశారన్నారు. పెద్దిరెడ్డి వేల కోట్లు అక్రమంగా కూడేశాడని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. అధికారం, ధన ప్రభావంతో విర్రవీగారన్నారు. మీ అరాచకాలు చూడలేకే ప్రజలు తిరగ పడుతున్నారన్నారు. డబ్బు మదంతో అబ్బా కొడుకులు దాడులు చేయిస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఓడించడానికి డబ్బులు వెదజల్లారన్నారు. అయినా ప్రజలు అబ్బా కొడుకుల కుట్రను తిప్పి కొట్టారని పేర్కొన్నారు. నిన్న మిథున్ రెడ్టి చేసిన నిర్వాకం ప్రజలు చూశారని.. వైసీపీ కార్యకర్తలే ఆయనకు అండగా నిలవలేదన్నారు. అబ్బా కొడుకుల అవినీతితో ఆ పార్టీ వాళ్లే ఆశ్చర్యపోయారన్నారు. మీ నియోజకవర్గంలో ప్రజలే మిమ్మల్ని ఛీ కొడుతున్నారన్నారు. వెయ్యి తరాలు తిన్నా... తరగని సంపదను పెద్దిరెడ్డి దోచుకున్నారని బుద్దా వెంకన్న అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa