‘దేశ ప్రజల ఆకాంక్షలను ఈ బడ్జెట్ ద్వారా నెరవేర్చే ప్రయత్నం జరిగింది అని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. అయన మాట్లాడుతూ.... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ దిగుబడి పెంచడంపై దృష్టి కేంద్రీకరించారు. సంక్షేమం కావాలి. తప్పదు. దాంతో పాటు ఉపాధి కల్పన కూడా కావాలి. ఉపాధి కల్పన కోసం బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ఐదేళ్లలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఇంత ఎక్కువగా మాట్లాడలేదు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనల ఫలితంగా ఇది సాధ్యపడింది. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడం సాధ్యపడింది. పోలవరం ప్రాజెక్టు పెరిగిన అంచనా వ్యయం ఇవ్వమని అడుగుతున్నాం. ఏపీకి పరిశ్రమలు రావాలని చెప్పగా.. కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్ ఇచ్చారు. ఇది చాలా ఉపయోగకరం. పూర్వోదయ స్కీమ్ ద్వారా తూర్పు భారత రాష్ట్రాల అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ భాగం. ఇందులో అన్ని రంగాల ప్రాజెక్టులు ఉంటాయి. బడ్జెట్ ద్వారా ఏపీ ప్రజలకు కొంత ఉపశమనం దొరికింది. ఏపీ ప్రజలు కోరుకుంటున్న దిశగా ఈ బడ్జెట్ ఒక మొదటి అడుగు. ఇందుకు ప్రధాన మంత్రికి, ఆర్థిక మంత్రికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు. ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది. హైదరాబాద్ ద్వారా ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తోంది. అలాంటి నగరం ఏపీకి లేదు. అమరావతిని గత ప్రభుత్వం ఆపేసింది. అమరావతి వల్ల రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా లాభం అని సీఎం చెప్పారు. వెనుకబాటుతనం తక్కువగా ఉన్న రాష్ట్రాలు నరేగా నిధులు ఎక్కువ తీసుకెళ్లారు. ఏపీ గత ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది.’ అని ఎంపీ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa