పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ విభాగంలో భారత జట్లు శుభారంభం చేశాయి. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి.పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.తొలిసారి ఒలింపిక్స్లో ఆడుతున్న బొమ్మదేవర ధీరజ్.. ర్యాంకింగ్ రౌండ్లో అదరగొట్టి, భారత్ టాప్-4లో నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. గురువారం పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో ప్రపంచకప్ కాంస్య పతక విజేత ధీరజ్ అదిరే ప్రదర్శనతో 681 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచాడు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ధీరజ్. అద్భుత విజయాలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. పారిస్ ఒలింపిక్స్లో రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించడంలో కీలకంగా నిలిచి మరో ఘనత సాధించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa