సోషల్ మీడియాలో ప్రముఖుల వ్యాఖ్యలు వైరల్ కావడం సహజం. తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీడియా సమావేశంలో భాగంగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడంలో వైఎస్ జగన్ తడబడటమే ఇందుకు కారణం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. వైఎస్ జగన్పై విమర్శలు గుప్పిస్తూ.. ఆయన కొలంబియన్ డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్తో పోల్చారు. అయితే ముఖ్యమంత్రి చేసిన విమర్శలకు ఏం సమాధానం ఇస్తారని మీడియా ప్రతినిధులు అడగ్గా.. పాబ్లో ఎస్కోబార్ పేరును ఆయన పలకలేకపోయారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా పాబ్లో ఎస్కోబార్ పేరు.. జగన్ నోటి వెంట రాలేదు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ట్రోల్స్, కామెంట్స్తో విరుచుకుపడుతున్నారు.
ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన వైఎస్ జగన్కు.. కనీసం పాబ్లో ఎస్కోబార్ పేరును కూడా పలకడం రాలేదు. ఈ క్రమంలోనే ఎవరు, ఏంటి అని ఆ రిపోర్టర్ను 2, 3 సార్లు జగన్ అడిగారు. ఆ రిపోర్టర్ పాబ్లో ఎస్కోబార్ పేరు చెప్పినా, పక్కన ఉన్నవారు కూడా చెప్పినా జగన్కు అర్థం కాలేదు. దీంతో ఆయన ఎవరో తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎవరో ఒకరి పేరును తీసుకువచ్చి.. పదే పదే చెబుతారని అన్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎవరు మాఫియా, ఎవరు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు అని వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు.
పాబ్లో ఎస్కోబారా, అతనెవరు.. ఏపీ సీఎంకు జగన్ స్ట్రాంగ్ కౌంటర్
ఇక పాబ్లో ఎస్కోబార్ పలకడంలో వైఎస్ జగన్.. ఇబ్బంది పడటంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు, తెలుగుదేశం కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రారంభించారు. అసలు జగన్కు ప్రెస్మీట్లలో మాట్లాడటం రాదంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో జగన్ మీడియా ముందు సరిగా పలకలేని పదాలకు సంబంధించిన ఘటనలను గుర్తు చేస్తూ.. ఆ వీడియోలను కామెంట్లలో పోస్ట్ చేస్తున్నారు. వాటిని ఖండిస్తూ వైసీపీ నేతలు, జగన్ మద్దతుదారులు కౌంటర్ కామెంట్లకు దిగుతున్నారు.
ఢిల్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరసన ధర్నాను వ్యతిరేకించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆయనను.. డ్రగ్ అమ్మకాలతో ప్రపంచాన్ని వణికించిన కొలంబియా డ్రగ్లార్డ్ పాబ్లో ఎస్కోబార్తో పోల్చుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం మాట్లాడారు. కింగ్ ఆఫ్ కొకైన్గా పేరు గాంచిన పాబ్లో ఎస్కోబార్ లాగా వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లో వ్యవహరించినట్లు చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.
పాబ్లో ఎస్కోబార్ ఒక నార్కో టెర్రరిస్ట్ అని.. ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా మారి డ్రగ్స్ వ్యాపారం చేసినట్లు తెలిపారు. టాటా, రిలయన్స్, అంబానీల కన్నా ఎక్కువ సంపన్నుడు కావాలనేది మాజీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యం అని.. అందుకే అలా చేసినట్లు చంద్రబాబు ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa