విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధినాయకత్వం బొత్స పేరును ప్రకటించింది. విశాఖ జిల్లా పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయాలను తెలుసుకున్న జగన్ బొత్స సత్యనారాయణను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గెలుపే లక్ష్యంగా... స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో గెలవాలని సీనియర్ నేత బొత్స సత్యనారాయణను పోటీలోకి దింపుతుంది. ఆయనయితే ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నేతగా కాపు సామాజికవర్గం నేతగా ఉన్న పేరుతో గెలవడం సులభమవుతుందని భావించి బొత్స పేరును జగన్ ఖరారు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa