అధ్యాపకులు, విద్యార్థులు ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి సూచించారు. నెల్లిమర్లలోని సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఆమె విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అంతకుముందు కళాశాల ఆవరణలో నిర్మించిన కళావేదికను ప్రారంభించారు. కళాశాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన, అదనపు తరగతి భవనాల నిర్మాణానికి చర్యలు చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కడగల ఆనంద్కుమార్, పార్టీ నాయకులు గేదెల రాజారావు, లెంక అప్పలనాయుడు, అట్టాడ శ్రీధర్, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు సరోజిని, జనసేన నాయకులు రవ్వా నాని, ఎంఎం నాయుడు, అంబళ్ల అప్పలనాయుడు, నల్లి శేఖర్, ఎడ్ల గోవిందరావు, గదల అచ్చింనాయుడు, కరుమజ్జి గోవిందరావు, కళాశాల ప్రిన్సిపాల్ మజ్జి సత్యనారాయణ, ఎన్ఎస్ఎస్ పీవో లెంక సంధ్య తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa