ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలోనే తొలిసారి,,,! నో టెన్షన్, ఎప్పటికప్పుడే పక్కాగా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 03, 2024, 09:34 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా నైపుణ్య గణన (స్కిల్ సెన్సెస్)కు సిద్దమైంది. రాష్ట్రంలో యువత, చదువుకున్నవారితో పాటూ ప్రజలందరి నైపుణ్యాలను గణించే దిశగా అడుగులు వేస్తున్నారు. స్కిల్ సెన్సెస్ అంటే కేవలం చదువులు పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారిని పరిగణలోకి తీసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం భిన్నంగా రాష్ట్రంలోని 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న అందరి నైపుణ్యాలను గణన చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.5 కోట్ల మంది నైపుణ్యాలు, వారి నైపుణ్యాల మెరుగుపరచుకునేందుకు ఆసక్తిని తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఈ నైపుణ్య గణనకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందిస్తోంది. కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకు మాత్రమే కాకుండా.. చేతి వృత్తులు, గృహిణుల వరకు ప్రతి వృత్తినీ గణనలోకి తీసుకోనుంది ప్రభుత్వం. అప్పుడే రాష్ట్రంలో ఎంత మంది ప్రజలు ఏయే రంగాల్లో నైపుణ్యం కలిగి ఉన్నారనే దానిపై స్పష్టత వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయం చేసే వారికి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని మెరుగుపరుచుకునేలా వారికి ఉన్న ఆసక్తిపై వివరాలు సేకరిస్తారు. ఒకవేళ గృహిణులైతే వారి చదువు, గతంలో పోటీ పరీక్షలు రాశారా? వారికి ఎలాంటి ఆసక్తులున్నాయి? అనే అంశాలను తెలుసుకుంటారు. రెండు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు.


రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా వారి నైపుణ్యాలను అంచనా వేస్తారు.. ప్రభుత్వం రూపొందించే యాప్‌లో ఓటీపీ ద్వారా లాగిన్‌ చేసి ప్రజలు వ్యక్తిగతంగా వారి నైపుణ్య వివరాలను అప్‌లోడ్‌ చేయొచ్చు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉండేవారి వివరాలను కూడా సేకరిస్తారు. రాష్ట్రంలో ఉన్నవారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నమోదు చేస్తారు. ఒక్కొక్కరు 20 మంది వివరాలను మాత్రమే తీసుకునేలా.. పక్కాగా సమాచారం అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.


ప్రభుత్వం ఇలా ప్రతి రంగంలోనూ ప్రజల నైపుణ్యాలు, వాటి మెరుగుదలకు ఉన్న ఆసక్తిని తెలుసుకోనుంది ప్రభుత్వం. ఇలా ప్రతి వృత్తి నైపుణ్యాన్నీ అంచనా వేయడం ద్వారా వారి భవిష్యత్తును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతి వృత్తిలోనూ నైపుణ్యాల స్థాయిని అంచనా వేయనున్నారు. ఒకే వృత్తిలో అందరూ ఒకే స్థాయి నైపుణ్యాలు కలిగి ఉండే అవకాశం ఉండదు కాబట్టి.. వారి స్థాయిలను కూడా కేటగిరీల వారీగా వర్గీకరిస్తారు. భవిష్యత్తులో ఎవరు ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అంచనా వేయడం సులభమవుతుంది అంటోంది ప్రభుత్వం.


రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య గణన తర్వాత ప్రభుత్వం ప్రజల నైపుణ్యాలను మెరుగుపర్చడంతో పాటుగా పరిశ్రమల అవసరాలను ఈ నైపుణ్యాలతో అనుసంధానం చేస్తారు. రాష్ట్రంలో అందరి నైపుణ్యాలు ఉన్నప్పటికీ వాటి గురించి పరిశ్రమలకు తెలియడం లేదు.. రాష్ట్రంలోని వివిధ రంగాలలో నైపుణ్యాలు కలిగిన వారు ఇంతమంది ఉన్నారనే లెక్కలు అందుబాటులో ఉంచితే బావుంటుందంటోంది ప్రభుత్వం. అప్పుడు సంబంధిత పరిశ్రమలు వారిని ఉద్యోగాల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ప్రజల నైపుణ్యాలను పరిశ్రమలకు అందుబాటులో ఉంచడం ద్వారా పరిశ్రమలు, నిరుద్యోగుల మధ్య గ్యాప్‌ను తొలగించాలని భావిస్తున్నారు. కొందరికి ఆసక్తి ఉన్నా నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉండదు.. అలాంటి వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa