గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు.ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వంలో విధ్వంసం మొదలైందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో విధ్వంసం, బెదిరింపులు చూశామని చెప్పారు.చిన్న తప్పు జరిగితే సరిచేయొచ్చని సూచించారు. కానీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే కష్టపడాలని తెలిపారు.మనమంతా కష్టపడితే 2047 నాటికి మూడో అతిపెద్ద ఎకానమీగా ఇండియా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.ఏపీ నుంచి వెళ్లిన వాళ్లు ఆర్బీఐ గవర్నర్లుగా, కేంద్ర ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు.కలెక్టర్ల కాన్ఫరెన్స్ చరిత్ర తిరగ రాయబోతుందని ధీమా వ్యక్తం చేశారు.గడిచిన ఐదేళ్లలో అందరం బాధపడ్డామని.. అందుకే ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని తెలిపారు. చరిత్రలోనే ఎన్నడూ రానంత పెద్ద విజయం ఇది అని పేర్కొన్నారు.ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa