• రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి కేటాయించిన 2092 మంది ఉద్యోగులకు తిరిగి నియామకాలు (re appropriating the 2092 posts) పాలనాపరమైన మంజూరు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం. (2088+4).
రాబోయే సాధారణ ఎన్నికల నిమిత్తం అదనపు పోస్టులు:
• వచ్చే సాధారణ ఎన్నికల్లో అదనపు సిబ్బంది నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆరు నెలల కాలపరిమితి కోసం చీఫ్ ఎలక్ట్రోరల్ ఆపీసర్ కార్యాలయానికి, జిల్లా కార్యాలయాలకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
• చీఫ్ ఎలక్ట్రోరల్ కార్యాలయంలో 82 పోస్టులు, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో 15 పోస్టులు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిన నియమిస్తారు.
పోస్టుల మంజూరు :
• కర్నూలు జిల్లా బనవాసిలో ఉన్న మేకలు, గొర్రెలు పరిశోధన కేంద్రంలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనిలో ఒక సీనియర్ సైంటిస్టుతో పాటు ముగ్గురు సైంటిస్ట్, ఒక అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ను డిప్యుటేషన్ ప్రాతిపదికన నియమించుకుంటారు. మిగిలిన సిబ్బందిని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా నియమించుకుంటారు. మొత్తం 12 మంది సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
• కర్నూలు జిల్లా బనవాసిలో మేకలు, గొర్రెలు పరిశోధన కేంద్రం మూడున్నర కోట్లతో రెండున్నర ఎకరాల్లో ఏర్పాటైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa