వీడ్కోలు సభలు స్పూర్తిదాయక కార్యక్రమాలుగా రూపుదిద్దుకోవాలని క్రీడలు, యువజనాభ్యుదయ శాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రమణ్యం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా సేవ చేయటం చిన్నవిషయం కాదని, ఎంతోవత్తిడితో కార్యభారం నిర్వహించవలసి ఉంటుందన్నారు. గురువారం పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు,యువజనాభ్యుదయ శాఖలో పదవీ విరమణ చేసిన ఇరువురు ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు పలికారు. సచివాలయంలోని మూడవ బ్లాక్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్వితో పాటు పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు. అదనపు కార్యదర్శి సీతారామ్, విభాగ అధికారి ప్రభాకర్ పదవీ విరమణచేయగా, వారిని శాఖ ఉద్యోగుల పక్షాన కార్యదర్శులు ఎల్ వి, మీనా ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎల్వి మాట్లాడుతూ ఉద్యోగులు నిరంతరం విషయ పరిజ్ఞానంను అలవరుచుకుంటూ మన సేవకోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని గుర్తెరిగి వ్యవహరించాలన్నారు. ముఖేష్ కుమార్ మీనామాట్లాడుతూ ఇకపై కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లని, వత్తిడికి దూరంగా కుటుంబ పరమైన అంశాలనుచక్కదిద్దుకోవటంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. వీడ్నోలు సభలో మన గురించి నాలుగు మంచి మాటాలు వినాలంటేఉద్యోగపర్వంలో పదిమందికి మంచి చేసి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉద్యోగ విరమణ తప్పదనిఅందుకు సంసిద్దులై ముందుగానే ప్రణాళిక రచించుకుంటే శేష జీవితం ప్రశాంతంగా గడపవచ్చన్నారు. కార్యక్రమంలోసహాయ కార్యదర్శి నాగమణి, ఓఎస్డి లక్ష్మణ మూర్తి, పర్యాటక అధికారులు మధుబాబు, ప్రభాకర్ తదితరులుపాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa