ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నేతలు పోలవరాన్ని నాశనం చేసారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 08:18 PM

పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి పోలవరాన్ని గోదావరిలో ముంచేసిన వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తీరు చూస్తుంటే దొంగే.. దొంగా దొంగా అని అరచినట్లు ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల కోసం ఢిల్లీ వెళ్లిన మంత్రి నిమ్మల ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.... 2014-19 మధ్య గత టీడీపీ ప్రభుత్వం పోలవరానికి రూ.11,500 కోట్లకు పైగా ఖర్చు పెట్టిందని, ఆ సమయంలో కేంద్రం రీయింబర్స్‌మెంట్ ద్వారా రూ.6వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ. 4,167కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని, కానీ మా హయాంలో జరిగిన పనితో కలుపుకుని రీయింబర్స్‌మెంట్ కింద రూ.8,382కోట్లు వచ్చాయని గుర్తు చేశారు. అలా వచ్చిన పోలవరం నిధులను ప్రాజెక్టు కోసం ఖర్చుపెట్టకుండా దారి మళ్లించిన ఘటన వైసీపీదే అంటూ మంత్రి ఆగ్రహించారు. కేంద్రం నిధుల కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర ఖజానా నుంచే ఖర్చు చేసిన చరిత్ర టీడీపీది అని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్ కుంగిపోవడం సహా అంచనాలు పెంచి టెండర్లు పిలిచిన అంశాలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నట్లు మంత్రి తెలిపారు. శాఖాపరంగా దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa