వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి అనేక ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పెద్ద మొత్తం సహాయం అందజేస్తున్నారు. తాజాగా విద్యుత్ ఉద్యోగులు సైతం మేమున్నామంటూ ముందుకు వచ్చారు. తమ ఒకరోజు జీతాన్ని విరాళంగా వరద బాధితులకు అందజేశారు. మంగళవారం ఉదయం మంత్రి గొట్టిపాటి రవి నేతృత్వంలో సీఎం చంద్రబాబును విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా తమ ఒక్క రోజు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు విద్యుత్ ఉద్యోగులు విరాళంగా ఇచ్చారు. మొత్తం రూ. 10.60 కోట్లని వరద సాయంగా ఉద్యోగులు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ... వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పని చేశారన్నారు. విద్యుత్ పునరుద్దరించడంలో విద్యుత్ ఉద్యోగులు అద్బుతంగా పని చేశారని కొనియాడారు. వరద బాధితులకు సేవలతో పాటు.. వరద సాయం కింద ఒక్క రోజు జీతాన్ని ఇచ్చారన్నారు. చంద్రబాబు పడుతున్న కష్టానికి ఊడతా భక్తిగా విద్యుత్ ఉద్యోగులూ చేయూతనిచ్చారని మంత్రి గొట్టిపాటి రవి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa