అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో శబరి, సీలేరు ఉపనదులతో పాటు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం-కూనవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాలలుకు సెలవులు ప్రకటించారు. మూడు రోజుల నుంచి ఆర్టీసీ బస్సు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరంలో శబరి, గోదావరి సంగమం వద్ద ఉన్న వంతెనను వరద నీరు తాకింది. సోకిలేరు, చంద్రవంక, చీకటివాగు, కుయుగూరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలంలో 22 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వీఆర్ పురం మండలం మండలంలోని ప్రధాన రహదారులపై ప్రవహిస్తున్న వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa