ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 18న జరుగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలోని ఒకటో నంబర్ బ్లాక్లో ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ఇటీవల సంభవించిన వరదల వలన కలిగిన నష్టం, ఆపరేషన్ బుడమేరుతో పాటుగా రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో నిర్మాణాలు, నూతన మద్యం పాలసీపైనా మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నట్లు తెలిసింది. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. విజయవాడతో పాటుగా పలుజిల్లాల్లోనూ వరదలు తీవ్ర నష్టం మిగిల్చాయి. రూ.6882 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదిక పంపింది.
ఈ నేపథ్యంలో వరదల వలన కలిగిన నష్టంతో పాటుగా వరద బాధితులకు సాయంపై ఏపీ కేబినెట్ చర్చించనున్నట్లు తెలిసింది. అలాగే కొత్త పింఛన్లపైనా కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్హులైన పలవురికి పింఛన్లు అందలేదని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో అర్హులకు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. దరఖాస్తు ఎప్పటి నుంచి చేసుకోవాలనే విషయాలపై మంత్రివర్గ సమావేశంలో స్పష్టత ఇచ్చే ఛాన్సుంది.
ఇక వీటితో పాటుగా నూతన మద్యం పాలసీపైనా ఏపీ మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఏపీలో ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. కొత్త మద్యం పాలసీ రూపకల్పనపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ భేటీ కూడా నిర్వహించింది. అలాగే అధికారులు సైతం వివిధ రాష్ట్రాలలో పర్యటించి నివేదిక తయారుచేశారు. ఆ నివేదికను ప్రభుత్వానికి కూడా అందించారు. ఈ నివేదికపై మంత్రివర్గ ఉపసంఘం సలహాలను కూడా స్వీకరించి.. ఏపీ నూతన మద్యం విధానం రూపొందించనున్నారు. దీనిపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలు చేయనుంది. మరోవైపు మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో చర్చించాల్సిన అంశాలను పంపాలని ఏపీ సీఎస్ అన్ని శాఖలను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa