బొత్స సత్యనారాయణకు ఉత్తరాంధ్రా రాజకీయాలపై పట్టు ఉండటంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా ఆ ప్రాంతంలో బలమైన వ్యక్తి కావడంతో ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ బొత్స సత్యనారాయణను ప్రకటించింది. టీడీపీ కూటమి నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి విశాఖపట్టణం నుంచి ఎమ్మెల్సీ ఇవ్వడంపై పార్టీలో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ వైసీపీ అధ్యక్షులు జగన్ బొత్సకు ప్రాధాన్యత ఇచ్చారు.
తాజాగా బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు వైసీపీని వీడాలని నిర్ణయించుకోవడం ఉత్తరాంధ్రా రాజకీయాల్లో సంచలనంగా మారింది. బొత్స కుటుంబానికి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. మొదటి నుంచి కుటుంబం మొత్తం ఒకే మాట మీద ఉంటుంది. బొత్స సత్యనారాయణ ఏది చెబితే అదే ఫైనల్. దీనిలో భాగంగా కుటుంబసభ్యులందరికీ రాజకీయ, వ్యాపార అవకాశాలు ఇప్పించడంలో బొత్స సత్యనారాయణ ముందు వరుసలో ఉండేవారు. అయినప్పటికీ లక్ష్మణరావు జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa