ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలినేనిని జనసేనలో చేర్చుకోవద్దంటూ నిరసనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2024, 07:32 PM

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైన వేళ ఒంగోలులో ఫ్లెక్సీల రగడ మరోసారి రాజుకుంది. తొలుత బాలినేని పార్టీ మార్పుపై ఎమ్మెల్యే జనార్దన్‌ ధ్వజమెత్తడం, అంతకు ముందు మాజీమంత్రి అనుచరులు వేసిన ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు తీసివేసే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఆ రెండు విషయాలపై బాలినేని కూడా స్పందించారు. ఈనేపథ్యంలో గురువారం బాలినేని జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే బుధవారం రాత్రి బాలినేని అనుయాయులు వేసిన ఫ్లెక్సీలను మరోమారు గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. అదేసమయంలో బాలినేనిని జనసేనలో చేర్చుకోవద్దంటూ తెలుగు యువత శ్రేణులు నగరంలో నిరసన కార్యక్రమం నిర్వహించాయి. తిరిగి బుధవారం రాత్రి ఎన్నికల ముందు టీడీపీలో చేరిన సూర్యప్రకా్‌షరెడ్డి.. బాలినేని మంత్రిగా అవినీతికి పాల్పడినందున పార్టీలోకి చేర్చుకోవద్దంటూ జనసేన అధినేత పవన్‌కు బహిరంగంగా సూచించారు. స్థానికంగా జరిగే అంశాలను పట్టించుకోకుండా గురువారం సాయంత్రమే పవన్‌ వద్ద పార్టీలో చేరాలని మాజీ మంత్రికి సమాచారం వచ్చింది. నగరంలో వ్యాపారవేత్త అయిన కంది రవిశంకర్‌, అతని సమీప బంధువు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రోశయ్య కూడా గురువారం జనసేనలో చేరనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa