ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో డ్రైవరు సజీవ దహనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2024, 07:33 PM

చిత్తూరు జిల్లా, బంగారు పాళ్యం మండలం, చిత్తూరు- బెంగుళూరు జాతీయ రహదారి మొగిలి ఘాట్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళుతూ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక లారీకి మంటలంటుకుని ఖాళీ బూడిద అయింది. అందులోని డ్రైవరు సజీవ దహనం అయ్యాడు. మరో డ్రైవర్ లారీలోనే ఇరుక్కున్నాడు. కట్టెల లోడుతో వెళుతున్న లారీ మంటలకు ఆహుతయింది. చక్కర లోడుతో వెళ్తున్న లారీ తునాతునకులైంది. అందులో ఇరుక్కున్న డ్రైవర్ మృతి చెందాడు. ఇద్దరు క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జేసీబీ యంత్రాల సహాయంతో చక్కెర లారీలో ఇరుక్కుని మృతి చెందిన డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా మొగిలి ఘాట్ రోడ్డు తరచూ ప్రమాదాలకు నిలయంగా మారింది. 15 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఆర్టీసీ బస్సును భారీ కంటైనర్ లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే ఇవాళ మరో రోడ్డు ప్రమాదం జరిగింది. తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa