ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాస్త్రీయ పరిశోధనలను సులభతరం చేయనున్న అత్యాధునిక కంప్యూటర్లు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2024, 08:27 PM

సూపర్‌ కంప్యూటింగ్ టెక్నాలజీ రంగంలో భారత్‌ను స్వావలంబన దిశగా సమున్నత స్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంలో గురువారం కీలక ముందడుగు పడింది. నేషనల్ సూపర్‌ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం) కింద దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు పరమ్ రుద్ర (PARAM Rudra) సూపర్ కంప్యూటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కంప్యూటర్ల విలువ సుమారు రూ. 130 కోట్లుగా ఉంది. పుణె, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో శాస్త్రీయ పరిశోధనలను సులభతరం చేసేందుకు ఈ సూపర్‌ కంప్యూటర్లను ఉపయోగించనున్నారు.ఇవాళ ప్రారంభించిన మూడు సూపర్‌కంప్యూటర్లు ఫిజిక్స్‌ నుంచి ఎర్త్‌ సైన్స్‌, కాస్మోలజీ వరకు అధునాతన పరిశోధనలు చేయడానికి దోహదపడతాయని ప్రధాని చెప్పారు. నేటి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రపంచం కీలకమైన ఈ రంగాలనే భవిష్యత్తు ప్రపంచంగా భావిస్తోందని అన్నారు. ఈ డిజిటల్ విప్లవాల యుగంలో కంప్యూటింగ్ సామర్థ్యం జాతీయ సామర్థ్యానికి పర్యాయపదంగా మారుతోందని వ్యాఖ్యానించారు. సాంకేతికత, కంప్యూటింగ్ సామర్థ్యంపై ప్రత్యక్షంగా ఆధారపడని రంగమంటూ ఏదీ లేదని, ఇది భారతదేశ విజయానికి అతిపెద్ద ఆధారమని మోదీ వ్యాఖ్యానించారు. ఇక వాతావరణం, సంబంధిత పరిశోధనల కోసం రూపొందించిన హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పీసీ) సిస్టమ్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ రూ. 850 కోట్లుగా ఉంది. పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను సరికొత్త హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సాంకేతికతలతో తయారు చేశారు. వీటిల్లో అత్యధిక విడిభాగాలను భారతదేశంలోనే తయారు చేశారు. మన దేశంలోనే అమర్చారు. ఇక సూపర్‌ కంప్యూటర్ల విషయానికి వస్తే పుణేలో జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్టీ), ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ (ఐయూఏసీ), కోల్‌కతాలో ఎస్‌ఎన్ బోస్ సెంటర్ సూపర్‌ కంప్యూటర్లను శాస్త్రవేత్తలు ఉపయోగించనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa