ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొగాకు నారుమడి దశలో అప్రమత్తంగా ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 11:44 AM

నారుమడి దశలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ రైతులకు సూచించారు. గోపాలపురం మండలంలోని వేలచింతల గూడెంలో నారుమడులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం పొగాకు బోర్డులో రైతు సంఘం నాయకులు సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిమితికి మించిన పొగాకును పండించ  వద్దని పురుగుమందు అవశేషాల వినియోగం తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎం జీఎల్‌కే ప్రసాద్‌, రైతు సంఘం అధ్యక్షుడు రాము, పొగాకుబోర్డు మాజీ వైస్‌ చైర్మన్‌ గద్దే శేషగిరిరావు, రైతు సంఘం గౌరవ అధ్యక్షుడు పిన్నమనేని మధుమోహన్‌, కాకర్ల జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa