వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం, ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆలయంలో ప్రవేశించే వ్యక్తి తన మతమేంటో చెప్పాలా.. ఇదేం దేశం.. ఇదేం హిందూయిజం’’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సోమిరెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని, ఆయనకు మతి చెలించి, మతిస్థిమితం కోల్పోయారని, మతాలు, దేశాల గురించి ప్రశ్నించే పరిస్థితికి వచ్చారని అన్నారు. ఒళ్లు కొవ్వెక్కి దేశం గురించి మాట్లాడే స్థితికి జగన్ దిగజారారని దుయ్యబట్టారు. సౌదీ అరేబియాకో, దుబాయ్కో వెళ్లిపోవాలని సూచించారు. ఇప్పటికైనా దేశానికీ, హిందువులకూ జగన్ క్షమాపణలు చెప్పి ఓ మూల కూర్చోవాలని సోమిరెడ్డి హితవుపలికారు. భారత పౌరుడిగా భావించకుంటే పాకిస్థాన్కు వెళ్లొచ్చునని, దేశానికి, హిందూ మతానికి, రాష్ట్రానికి జగన్ క్షమాపణ చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. తల్లి, చెల్లినీ దూరంగా పెట్టిన జగన్నకు మతం, దేశం, రాష్ట్రంపై ఏమి గౌరవం ఉంటుందని అన్నారు. జగన్ తాను పుట్టిన రాయలసీమలోని తిరుపతికి పోలేకున్నారని, పెద్దిరెడ్డి పుంగనూరులో, మిధున్ రెడ్డి రాజంపేటలో అడుగుపెట్టలేకున్నారని ఎద్దేవా చేశారు. కొడాలి నానీ, వల్లభనేని వంశీ, రోజా వారి జిల్లాలకు పోలేకపోతున్నారని, విజయసాయి రెడ్డి విశాఖకు వెళ్లలేరని, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారని అన్నారు. వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి జైలులో ఊచలు లెక్కపెడుతున్నారన్నారు. తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇస్తే, భారతి ఇంట్లోకి రానివ్వరేమో... సంతకం పెడితే క్రిస్టియన్ ఓట్లు పోతాయని, పెట్టకుంటే హిందువుల ఓట్లు పోతాయనే భయంలో జగన్ ఉన్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa