నెల్లూరు నగర కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నగరంలో అపరిష్కృత సమస్యలపై దృష్టి సారించాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. "నెల్లూరు నగరంలో సమస్యలున్న ప్రాంతాలను ఒక్కొకటిగా పర్యటిస్తున్నా. నగరంలో కొన్ని రోడ్ల మరమ్మత్తులకు పది రోజుల్లో టెండర్లు పిలిచి పనులకు ఆదేశిస్తాం. కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్య ఆరు నెలల్లో పరిష్కరించాలని ఆదేశించా. పార్కులు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. వాటిని పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. నగరంలో గ్రీనరి డెవలప్మెంట్ కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చే వాళ్లను స్వాగతిస్తున్నాం. నెల్లూరులో ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ సమస్య ఉంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. లడ్డూ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందు వల్ల కూటమి నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేయెుద్దని కోరుతున్నా" అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa