అంతర్జాతీయంగా గత కొన్ని నెలలుగా ముడి చమురు ధరలు దిగివస్తున్నాయి. అయితే మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. అయితే గతంలో క్రూడాయిల్ ధరలు పెరిగినా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ఆ నష్టాలను పూడ్చుకునేందుకు ఇప్పుడు చమురు ధరలు తగ్గించకుండా చమురు సంస్థలకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. అయితే త్వరలోనే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తలు వార్తలుగానే మిగలనున్నాయి. పెట్రో ధరల తగ్గింపు మాట అటుంచితే.. పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధం జరుగుతోంది. పైగా ఇరాన్లోని చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇదే విషయాన్ని అమెరికాతోపాటు అంతర్జాతీయ మీడియా కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇంధన ధరలు తగ్గే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తే భారత్పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని.. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
మరోవైపు.. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రస్తుతం కమ్ముకున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 75 డాలర్లు దాటిపోవడంతో అంతర్జాతీయంగా పెట్రో ధరలపై ప్రభావం పడనుంది. గత రెండు, మూడు రోజుల్లోనే ముడి చమురు ధరలు 5 శాతం వరకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇరాన్ నిత్యం 1.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తోంది. ఇక ఈ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే మాత్రం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఇటీవల క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అయ్యాయి. ఈ క్రమంలోనే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa