కుస్తీ యోధురాలు, కాంగ్రెస్ నాయకురాలు వినేశ్ ఫొగాట్ హరియాణా ఎన్నికల్లో విజయం సాధించారు.జులానా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పారిస్ ఒలింపిక్స్ వేదికగా తృటిలో పతకాన్ని చేజార్చుకున్న ఆమె.. ఎన్నికల సమరంలో మాత్రం ఓటమిని దరి చేరనివ్వలేదు. ఈ స్థానంలో బరిలో నిలిచిన భాజపా అభ్యర్థి యోగేశ్ కుమార్, ఆప్ అభ్యర్థి కవితా రాణి ఆమె చేతిలో పరాజయం పాలయ్యారు.వినేశ్ విజయంపై రెజ్లర్ బజరంగ్ పునియా అభినందనలు తెలుపుతూ పోస్టు పెట్టారు. ''విజయం సాధించిన భారత పుత్రిక వినేశ్ ఫొగాట్కు అభినందనలు. ఇది జులానా సీటుకు సంబంధించిన పోటీ కాదు. అలాగే ఏదో మూడు నాలుగు స్థానాలు, పార్టీల మధ్య పోరు అసలే కాదు. ఈ పోరు బలమైన అణచివేత శక్తుల మధ్య జరిగింది. అందులో వినేశ్ గెలిచింది'' అని ఆమె ఫొటోను షేర్ చేశారు. తన సమీప భాజపా ప్రత్యర్థిపై ఆరువేల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. అక్టోబర్ 5న హరియాణాలో ఎన్నికలు జరగ్గా.. ఈ రోజు ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ రాష్ట్రంలో భాజపా మూడోసారి అధికారాన్ని చేపట్టే దిశగా పయనిస్తోంది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించినా.. తర్వాత కమలం దాటికి నిలవలేక రెండో స్థానానికి పరిమితమైంది.ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఖాళీ చేతులతో ఆమె స్వదేశానికి చేరుకోవాల్సి వచ్చింది. ఆ పరిణామం యావత్ భారతావనిని బాధించింది. అనంతరం భవిష్యత్ కార్యాచరణనను ప్రకటించిన ఆమె కాంగ్రెస్లో చేరి రాజకీయ ప్రయాణాన్ని ఆరంభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa