భారత్, అమెరికా మధ్య రక్షణ ఒప్పందంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సైన్యాన్ని మరింత బలోపేతం చేసేలా అత్యంత శక్తివంతమైన ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి 31 ప్రిడేటర్ డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతు, సమగ్ర ఏర్పాటు కోసం రూ.32 వేల కోట్ల (3.5 బిలియన్ డాలర్లు) మేర ఒప్పందం ఇరు దేశాలూ మంగళవారం సంతకం చేశాయి. విదేశీ సైనిక కొనుగోళ్ల ఒప్పందం కోసం అమెరికా బృందం భారత్కు వచ్చింది. రక్షణశాఖ ఉన్నతాధికారులు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. అమెరికాకు చెందిన జనల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్.. ఈ డ్రోన్లను భారత్కు అందజేయనుంది.
కాగా, భద్రతా వ్యవహారాల క్యాబినేట్ కమిటీ గత వారం 31 ప్రిడేటర్ డ్రోన్లను అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. వాటిలో 15 భారత నౌకాదళానికి, మిగతావి వైమానిక దళం, ఆర్మీల మధ్య సమంగా పంపిణీ చేయనున్నారు. అయితే, ఈ ఒప్పందం కోసం అమెరికా, భారత్ల మధ్య చాలా ఏళ్లుగా చర్చలు నడుస్తున్నాయి. కానీ, అనివార్య కారణాల వల్ల ఒప్పందం ఆలస్యమైంది. కొన్ని వారాల కిందట జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భేటీలో చివరి అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో, ఒప్పందం ముందుకు సాగింది.
MQ-9B ప్రిడేటర్ డ్రోన్ అనేది GA-ASI అభివృద్ధి చేసిన MQ-9 'రీపర్' ఆధునిక రూపం. ఈ మానవ మానవరహిత లోహవిహంగం 40,000 అడుగుల ఎత్తులో ఒకేసారి 40 గంటల పాటు ఎగరగలదు. ఇది 2,155 కిలోల బాహ్య పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. నిఘా మాత్రమే కాకుండా క్షిపణులపై దాడిచేసే ఆయుధ సామర్థ్యం కూడా దీని సొంతం. ఇది అధిక ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేధించడానికి వీలు కల్పిస్తుంది. టేకాఫ్, ల్యాండింగ్ స్వీయ నియంత్రణలో ఉంటాయి.
ఈ సామర్థ్యాలు డ్రోన్ను ఉపరితల, సముద్ర నిఘా, యాంటీ సబ్మెరైన్, యాంటీ-సర్ఫేస్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఎక్స్డిషనరీ మిషన్లకు సహకారం అందించేలా చేస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa