తిరుమలలో సమస్యలపై మరోసారి ఫోకస్ పెట్టారు టీటీడీ అధికారులు. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా వకుళామాత కేంద్రీయ వంటశాలను పరిశీలించి.. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పీఏసీ-5ను తనిఖీ చేశారు. అక్కడ పనుల పురోగతి గురించి ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కౌస్తుభం, సప్తగిరి, ఎస్ఎంసీ, షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర హోటళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం శిలా తోరణం దగ్గరకు చేరుకుని తనిఖీలు చేపట్టారు.
మరోవైపు తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్మిస్తున్న నూతన క్యూలైన్లు, మరుగుదొడ్లు, ఫుడ్ కోర్టులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో టీటీడీ సీఈ సత్య నారాయణ, ఈ ఈలు వేణు గోపాల్, సుబ్రహ్మణ్యం, డీఈ చంద్రశేఖర్, ఎస్టేట్స్ అధికారి వెంకటేశ్వరులు, డిప్యూటీ ఈవో (హెల్త్) ఆశాజ్యోతి, హెల్త్ అధికారి డా. మధుసూదన ప్రసాద్, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు ఎన్నికలకు ఏర్పాట్లు
ఈనెల 28వ తేది నిర్వహించనున్న టీటీడీ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్(టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ (విద్య & ఆరోగ్యం) గౌతమి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో సంబంధిత అధికారులతో జేఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమలలోని ఎస్వీ హైస్కూల్, తిరుపతిలోని ఎస్.జీ.ఎస్.హైస్కూల్ లో ఎన్నికల కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు జేఈవో. తిరుమలలో పని చేసే ఉద్యోగులు ఎస్వీ హైస్కూల్ లో, తిరుపతి, ఇతర ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు ఎస్.జీ.ఎస్ హైస్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పారు. ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఉద్యోగి తమ ఒరిజినల్ ఐడీ కార్డు తప్పనసరిగా తీసుకు రావాలని అన్నారు. ఎన్నికల కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించబడవనీ, సెల్ ఫోన్ల డిపాజిట్ కు ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు జనరేటర్లు, మైకులను అందుబాటులో ఉంచుకుని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. విజిలెన్స్ విభాగం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని సెక్యూరిటీ గార్డులతో పాటు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే టీటీడీ ఐటీ విభాగం, ఇంజినీరింగ్, సెక్యూరిటీ విభాగాలకు తమ విధులపై దిశానిర్దేశం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa