ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతికి రైతన్నకు శుభవార్త చెప్పనున్న ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 11, 2024, 03:56 PM

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో ఎన్డీయే ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. బడ్జెట్‍లో "అన్నదాత సుఖీభవ" పథకానికి చంద్రబాబు సర్కార్ రూ.4,500 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.20వేలు జమ చేయనుంది. 2025 సంక్రాంతి నుంచి దీన్ని అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు నిధులు కేటాయిస్తూ అన్నదాతల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తానని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. 


ఇటీవల దీపావళి నుంచి మహాలక్ష్మి పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను సైతం ఆయన మహిళలకు అందిస్తున్నారు. అయితే అన్నదాత సుఖీభవ పథకాన్ని వైసీపీ హయాంలో "వైఎస్ఆర్ రైతు భరోసా"గా అమలు చేశారు. ప్రస్తుతం దాని పేరు మారుస్తూ కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు తోడు చంద్రబాబు సర్కార్ ఏకంగా రూ.14 వేలు కలిపి రైతుల చేతికి రూ.20 వేలు అందించనుంది. అలాగే ఈ సంక్రాంతి నుంచి పథకాన్ని అమలు చేయనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa