ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సదుపాయాల కోసం కాదు, ప్రజల తరుపున పోరాడటానికి అడుగుతున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 11, 2024, 06:28 PM

వైసీపీ ఎమ్మెల్యే లు అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై తన అనుకూల ఎల్లో మీడియా ద్వారా సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు. సభలో తమకు మాట్లాడే అవకాశం వస్తేనే ప్రజా సమస్యలు ప్రస్తావించగలమని, ప్రతిపక్ష హోదా లేకుండా, సభలో మాట్లాడే అవకాశం రాదని.. అందుకే ఆ హోదా కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అంతే తప్ప సదుపాయాల కోసం కాదని తేల్చి చెప్పారు.


అసలు 11 సీట్లు వస్తే, ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని చట్టంలో ఉంటే చూపించాలని డిమాండ్‌ చేసిన ఎమ్మెల్యే చంద్రశేఖర్, ప్రజల గొంతుకై వ్యవహరిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై బనాయిస్తున్న అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.    ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, అలా ఇస్తామని ప్రకటిస్తే సభకు హాజరవుతామని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa