ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దమ్ముంటే అసెంబ్లీకి రావాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 11, 2024, 06:30 PM

వైఎస్ జగన్‌కు నీతి నిజాయితీ ఉంటే అసెంబ్లీకి హాజరుకావాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. తప్పులు చేసినందుకే భయపడి.. వైఎస్ జగన్ అసెంబ్లీకి రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని వైఎస్ జగన్‌కు మంత్రి సూచించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ ప్రతిపక్ష హోదాకు కూడా పనికి రాడని.. అందుకే ప్రజలు ఆయన్ని పక్కన పెట్టారన్నారని ఆయన ఎద్దేవా చేశారు.


ప్రజలు పక్కన పెట్టినా వైఎస్ జగన్‌కు సిగ్గు రావడం లేదని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ విద్వంసం సృష్టించిందని గుర్తు చేశారు. దీంతో పెట్టుబడి దారులు సైతం రాష్ట్రం నుంచి వెళ్లిపోయారన్నారు. ఇలాగే వైఎస్ జగన్ వ్యవహరిస్తే.. చివరకు ఒక సీటు కూడా ఆ పార్టీకి రాదని ఆయన జోస్యం చెప్పారు. పోర్టులన్నీ ప్రైవేటు పరం చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారని గుర్తు చేశారు. అయితే అరబిందో కంపెనీ అనేది... వైఎస్ జగన్ బినామీ కంపెనీ అని మంత్రి బీసీ జానార్దన రెడ్డి ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa