సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా గుంటూరు జిల్లా నకరేకల్కు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆఫీసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వంపైన, ప్రభుత్వ పెద్దలపైన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లను పోలీసులు రోజుకో చోట అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నారు. ఈరోజు ఉదయం రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న గుంటూరు జిల్లా సబ్ జైలులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అంబటి రాంబాబు పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. నకిరేకల్కు చెందిన రాజశేఖర్ రెడ్డిని వేధింపులకు గురిచేస్తున్నారని.. దమ్ముంటే రాజశేఖర్ రెడ్డి తన ఇంట్లో ఉంటాడని తీసుకువెళ్లాలని అన్నారు. అలాగే గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాక్షి దినపత్రిక రిపోర్టర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు కూడా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అలాగే గతంలో జడ్జిలపై కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల విషయంలో ఇప్పటికే పలువురిని గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మున్ముందు మరికొందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వారి కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతీ ఒక్కరినీ కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa