మద్రాస్ హైకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రేమలో ఉన్నపుడు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం సాధారణమే అని పేర్కొన్న ధర్మాసనం.. వీటిని లైంగిక నేరాలుగా పరిగణించి.. సదరు వ్యక్తిని దోషిగా తేల్చలేమని స్పష్టం చేసింది. ఇద్దరు యువతీయువకులు ప్రేమించుకోగా.. తనను ముద్దు పెట్టుకున్నాడని, హగ్ చేసుకున్నాడని.. సదరు యువకుడిపై ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు కాస్తా.. తాజాగా మద్రాస్ హైకోర్టు ముందుకు విచారణకు రాగా.. ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది.
ప్రేమలో ఉన్నప్పుడు హగ్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం సాధారణమేనని పేర్కొన్న మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్.. ఐపీసీ సెక్షన్ 354-ేఏ(1)(i) కింద వీటిని నేరాలుగా పరిగణించడం కుదరదని తీర్పును వెల్లడించింది. 21 ఏళ్ల యువకుడిపై 19 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. తాము ప్రేమలో ఉన్నపుడు 2022 నవంబర్లో ఒక రోజు రాత్రి తాము ఇద్దరం కలుసుకున్నామని.. అయితే ఆ సమయంలో ఆ యువకుడు.. తనను ముద్దులు పెట్టుకున్నాడని.. హగ్ కూడా చేసుకున్నాడని.. యువతి చేసిన ఫిర్యాదును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది
ఈ సందర్భంగా ఇలాంటి ఘటనల్లో ఏవి నేరాలు అనేది కోర్టు వ్యాఖ్యానించింది. ముందుగా ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి శారీరక సంబంధం పెట్టుకోవడం.. లైంగికంగా మోసం చేయడం వంటివి చట్టప్రకారం నేరంగా పరిగణిస్తారని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రేమలో ఉన్నపుడు.. ఇద్దరూ తమ ఇష్టపూర్వకంగానే కలిశారని.. టీనేజ్ ప్రేమల్లో హగ్లు, కిస్లు సహజమని తెలిపింది. ఇద్దరూ ఏకాభిప్రాయంతో సంబంధం పెట్టుకుని.. ఆ తర్వాత తగాదాలు వచ్చి విడిపోయిన తర్వాత ఇలా ఒకరిపై మరొకరు కేసులు వేయడం సరైంది కాదని ఈ సందర్భంగా కోర్టు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa