విశాఖపట్నంవాసులకు ముఖ్య గమనిక. వచ్చే జనవరి నుంచి విశాఖపట్నంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చే ప్రక్రియలో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి 1వ తేదీ నుంచి విశాఖపట్నంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించారు. ఈ విషయాన్ని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ తెలిపారు. జనవరి ఒకటో తేదీ నుంచి విశాఖలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంతో పాటుగా వాటిని అమ్మేవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడే వారితో పాటుగా.. వాటిని విక్రయిస్తే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం గురించి విశాఖ ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించనున్నారు. 45 రోజులపాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలు, శానిటేషన్ కార్యదర్శులు పాల్గొంటారు. అలాగే కార్పొరేషన్ సిబ్బంది ప్రతి వార్డులో సే నో టు ప్లాస్టిక్ నినాదంతో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్రజలను చైతన్యం చేయనున్నారు. మరోవైపు విశాఖపట్నం దేశంలోనే నాలుగో పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందిందన్న విశాఖ కలెక్టర్.. ఇంకా పరిశుభ్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో ప్లాస్టిక్ నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు,
మరోవైపు 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి రానున్న నేపథ్యంలో విశాఖవాసులంతా పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కలెక్టర్ కోరారు. ప్లాస్టిక్ ఉత్పత్తిదారులు, విక్రయదారులు కూడా ఈ మార్పులో భాగస్వామ్యం కావాలని కోరారు. పర్యావరణానికి మేలు చేసే ఎకో ఫ్రెండ్లీ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవటం ద్వారా విశాఖపట్నం నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్ల బదులుగా క్లా్త్ బ్యాగులు వాడాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa