ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. అయోధ్య, కాశీ తదితర పుణ్య క్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ ప్రత్యేక రైలును నడుపుతోంది. ఈ టూర్ ప్యాకేజీలో మొత్తం 9 రాత్రులు, 10 పగటి వేళలు ఉన్నాయి. ఈ భారత్ గౌరవ్ రైలు డిసెంబరు 11న సికింద్రాబాద్లో బయల్దేరుతుంది.. పుణ్యక్షేత్రాల దర్శనం తర్వాత 20న తిరుగు ప్రయాణమవుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లోని ఈ స్టేషన్లలో ఆగుతుంది.. సికింద్రాబాద్లో ఈ రైలు ప్రారంభమై.. కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం (పెందుర్తి), విజయనగరం రైల్వే స్టేషన్ల మీదుగా ఒడిశాకు వెళుతుంది. అక్కడి నుంచి పుణ్యక్షేత్రాల సందర్శన ప్రారంభమవుతుంది.
ఈ రైలు ప్యాకేజీలో.. విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని మీదుగా పూరిలోని జగన్నాథ ఆలయం, గయలో విష్ణుపాద ఆలయం, కాశీ విశాలాక్షి, వారణాశిలో కాశీ విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణాదేవి, సాయంత్రం గంగా హారతి ఉంంది. అలాగే అయోధ్యలో సరయు నది దగ్గర రామజన్మభూమి, హనుమాన్ గర్హి, ప్రయోగ్రాజ్లో త్రివేణి సంగమం వంటి ప్రాంతాలను సందర్శించొచ్చు. ఈ ప్యాకేజీలో టీ, టిఫిన్, భోజనం, రవాణా, ప్రమాద బీమా అన్ని పన్నులతో సహా కలిపి టికెట్ ధర ఒక్కొక్కరికీ స్లీపర్ క్లాస్ రూ.16,800, థర్డ్ ఏసీలో రూ.26,650, సెకెండ్ ఏసీలో రూ.34,910 ఉంటుందని తెలిపారు. ఈ టూర్కు వెళ్లానుకునే యాత్రికులు.. టికెట్ల బుకింగ్ ఇతర వివరాలకు 9281495848, 8977314121 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మరోవైపు రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో నడుస్తున్న 10 రైళ్ల నంబర్లను మార్చారు. సాధారణ నిర్వహణ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మార్పు చేసిన రైళ్ల నంబర్లు మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు చెప్పారు. విశాఖపట్నం-కడప (17488/17487) తిరుమల ఎక్స్ప్రెస్కు కొత్తగా 18521/18522 నంబర్లను కేటాయించారు. విశాఖపట్నం- గుంటూరు (22701/22702) నంబర్లతో నడిచే ఉదయ్ ఎక్స్ప్రెస్కు కొత్తగా 22875/22876 నంబర్లను ఇచ్చారు. భువనేశ్వర్-రామేశ్వరం (20896/20895) నంబర్లతో నడిచే వీక్లీ ఎక్స్ప్రెస్కు కొత్తగా 20895/20896 నంబర్లు కేటాయించారు. భువనేశ్వర్-పుదుచ్చేరి (12898/12897) నంబర్లతో నడిచే ఎక్స్ప్రెస్కు 12897/12898, భువనేశ్వర్- చెన్నై సెంట్రల్ 12830/12829 ఎక్స్ప్రెస్కు కొత్తగా 12829/12830 నంబర్లను కేటాయించారు అధికారులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa