టీ20ల్లో అత్యంత వేగంగా 28 బంతుల్లో సెంచరీ సాధించిన భారత క్రికెటర్గా గుజరాత్ క్రికెటర్ ఉర్విల్ పటేల్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉండేది. మధ్యప్రదేశ్లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురతో కలిసి 26 ఏళ్ల ఉర్విల్ అసాధారణ ప్రతిభ కనబరిచి పంత్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఉర్విల్ పటేల్ అన్-సోల్డ్ క్రికెటర్గా ఉన్నాడు.ఇండోర్లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో త్రిపుర, గుజరాత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.ఈ లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్.. ఉర్విన్ పటేల్ దూకుడు ఇన్నింగ్స్తో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఉర్విన్ మొదటి ఓవర్ నుంచి ప్రారంభించి 10.2 ఓవర్ వరకు చెలరేగిపోయాడు. ఈ మధ్యలో కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. చివరకు 35 బంతులు ఎదుర్కొన్న ఉర్విన్ పటేల్ 10.2 ఓవర్లలో 12 సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 113 పరుగులు చేసి గుజరాత్ జట్టు బౌలర్లపై చెలరేగిపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa