ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుమార్తెపై సవతి తండ్రి పలుమార్లు అత్యాచారం.. 141 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 08:54 PM

కేరళలోని ఓ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బాలికపై అత్యాచారం చేసిన సవతి తండ్రికి ఏకంగా 141 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. 3 ఏళ్లపాటు ఆ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన నిందితుడు.. ఎవరికీ విషయం చెప్పొద్దని బెదిరించాడు. చివరికి ఆ దుర్మార్గుడి అకృత్యాలు భరించలేక.. బాలిక తన స్నేహితురాలికి విషయం చెప్పింది. దీంతో వారిద్దరూ తల్లికి విషయం చెప్పడంతో కేసు నమోదు కాగా.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.. తాజాగా తీర్పునిచ్చింది.


కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం.. ఉపాధి కోసం కేరళకు వలస వచ్చింది. ఈ క్రమంలోనే బాలికపై ఆమె సవతి తండ్రి తరచూ అత్యాచారం చేసేవాడు. తన తల్లి ఇంట్లో లేని సమయం చూసి.. ఆ బాలికపై అకృత్యానికి తెగబడేవాడు. అయితే ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని భయపెట్టడంతో.. ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. ఈ క్రమంలోనే 2017 నుంచి 2020 వరకు ఆ బాలికపై.. సవతి తండ్రి పలుమార్లు


లైంగిక దాడికి దిగాడు.


 అయితే ఈ అత్యాచారాలను భరించలేకపోయిన ఆ బాలిక.. తాను అనుభవిస్తున్న బాధను తన స్నేహితురాలికి చెప్పింది. ఆ విషయాన్ని తల్లికి చెప్పాలని.. ఆమె స్నేహితురాలు సూచించడంతో ధైర్యం చేసి.. విషయాన్ని బాధిత బాలిక తల్లికి వివరించింది. అది విని షాక్ అయిన బాలిక తల్లి.. జరిగిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ సవతి తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు, ఐపీసీ, జువైనల్ జస్టిస్ చట్టాల్లోని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే 2022లో బెయిల్‌పై విడుదలైన ఆ దుర్మార్గుడు.. మరోసారి ఆ బాలికపై లైంగిక దాడికి దిగాడు. దీంతో బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేయడంతో.. ఇంకో కేసు నమోదైంది.


ఈ ఘటనపై విచారణ జరిపిన మంజేరీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.. నిందితుడిపై పలు సెక్షన్ల కింద శిక్ష విధించారు. మొత్తంగా 141 ఏళ్ల పాటు అతడికి శిక్ష విధిస్తూ మంజేరీ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి అష్రఫ్ ఏఎం.. నవంబర్ 29వ తేదీన సంచలన తీర్పుని వెలువరించారు. నిందితుడు సవతి కుమార్తెపై గత కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే వివిధ శిక్షలను విధించారు. అయితే అన్ని శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని కోర్టు వెల్లడించింది. దీంతో ఆ వ్యక్తి గరిష్ఠంగా 40 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా జైలు శిక్షతోపాటు దోషికి రూ.7.85 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. ఈ నష్టపరిహారాన్ని బాధితురాలికి అందించాలని కోర్టు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com