ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1,600 నూతన బస్సులు కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. వీటిలో ఇప్పటికే 900 బస్సులు అందుబాటులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విజయవాడ బస్ డిపోలో నూతన బస్ సర్వీసులను కొనకళ్ల ప్రారంభించారు. కొత్తగా కొనుగోలు చేస్తున్న 1,600 బస్సులను రాష్ట్రవ్యాప్తంగా నడపనున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ తెలిపారు.ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కొనకళ్లు చెప్పారు. ఇందుకు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్లు, అధికారులతో కలిసి కార్యాచరణ రూపొందించినట్లు కొనకళ్ల వెల్లడించారు. ముందుగా దెబ్బతిన్న బస్టాండ్లలో అభివృద్ధి పనులు చేపడతామని ఆయన చెప్పారు. ఏపీలో ఎలక్ట్రికల్ బస్సులను పెద్దస్థాయిలో నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa