శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్పై పంజాబ్లోని అమృత్సర్లో బుధవారం (డిసెంబర్ 4) దాడి జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో సుఖ్బీర్ బాదల్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో సేవ చేస్తుండగా ఓ వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు.ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు కాల్పులు జరుపుతున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సుఖ్బీర్ బాదల్ క్షేమంగా బయటపడ్డారు. అయితే అకాలీదళ్ నాయకుడు ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. గురుద్వారాలో శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ ఇచ్చిన మతపరమైన శిక్షను అనుభవించడానికి సుఖ్బీర్ శ్రీహర్మందిర్ సాహిబ్ చేరుకున్నారు.అందిన సమాచారం ప్రకారం నిందితుడిని నారాయణ్ సింగ్ చౌరాగా గుర్తించారు. డేరా బాబా నానక్తో పాటు దాల్ ఖల్సాకు అతను బంధువు అని పోలీసులు విచారణలో తేలింది. గతంలో నారాయణ్ సింగ్ చౌరా కూడా ఖలిస్తానీ ఉగ్రవాదిగా పని చేసినట్లు గుర్తించారు. దాడి చేసిన నారాయణ్ సింగ్ చౌరా బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) ఉగ్రవాది. 1984లో పాకిస్థాన్కు వెళ్లాడు. అక్కడ ఉగ్రవాదం ప్రారంభ దశలో పంజాబ్లోకి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను అక్రమంగా రవాణా చేయడంలో కీలకపాత్ర పోషించాడు. పాకిస్తాన్లో నివసిస్తున్నప్పుడు, అతను గెరిల్లా యుద్ధం, దేశద్రోహ సాహిత్యంపై ఒక పుస్తకాన్ని వ్రాసినట్లు సమాచారం. బుదైల్ జైల్బ్రేక్ కేసులో కూడా నిందితుడు. నారాయణ్ గతంలో పంజాబ్ జైలులో శిక్షను అనుభవించారు.
నిందితుడు నారాయణ్ సింగ్ చౌరా మంగళవారం(డిసెంబర్ 4) శ్రీహర్మందిర్ సాహిబ్లో తిరుగుతూ కనిపించాడు. ఇంటెలిజెన్స్ సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై అతనిపై నిఘా పెట్టారు. సుఖ్బీర్ బాదల్ భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అకాలీ నేతలు ఆరోపించారు. మరోవైపు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏడీసీపీ హర్పాల్ సింగ్ తెలిపారు. దాడి చేసిన వ్యక్తి మంగళవారం కూడా ఇక్కడే ఉన్నాడు. ఇవాళ బుధవారం అతను మొదట గురుజీకి నమస్కరించాడు. అనంతరం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa