AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారి పేట సమీపంలో పంట కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కారు విశాఖపట్నం నుంచి పి.గన్నవరం మండలంలోని పోతవరం ఇంటికి వెళ్తుండగా తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో మహిళ డ్రైవింగ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa