ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్పపీడనంతో ఆందోనళనలో రైతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 01:23 PM

వరుస వాయుగుండాలు, అల్పపీడనాలతో సాగు పనులకు ఆటంకాలు కలుగుతున్నాయి. అయినప్పటికీ రైతులు ఇటు సార్వా మాసుళ్లు, అటు దాళ్వా నారుమడుల పనులను ముమ్మరంగా చేస్తున్నారు. పది రోజుల క్రితం తుఫాన్‌తో సార్వా మాసూళ్ళు కొన్ని రోజులు నిలిచిపోయాయి. వారం రోజుల్లో 80 వేల ఎకరాలు మాసూళ్లు చేశారు. దీంతో భీమవరం పరిధిలో లక్షా 95 వేల సార్వా పంటకు లక్షా 35 వేల ఎకరాల పంట మాసూళ్లయ్యింది. ఇంకా 59 వేల ఎకరాలు జరగాలి. వీటిని మరో నాలుగు రోజుల్లో పూర్తి చేసేలా రైతులు అడుగులు వేస్తున్నారు. మాసుళ్ళు జరుగుతుండగానే వచ్చే దాళ్వాకు నారుమడులు వేయడంపైన రైతులు దృష్టి పెట్టారు. దాళ్వా పంట రెండు లక్షల 25 వేల ఎకరాలకు గాను, పది వేల ఎకరాల వరకు నారుమడులు వేయాలి. ఇప్పటికీ వ్యవసాయ అధికారుల లెక్కలు ప్రకారం 256 ఎకరాల్లో నారుమడులు వేశారు. వారం రోజుల్లో నారుమడులు పూర్తి చేసే ఆలోచనలో రైతులు ఉన్నారు. వచ్చే నెల పదో తేదీలోపు నాట్లు వేయాలని అంచనా వేస్తున్నారు. ఆ విధంగా నారుమడులు పడితేనే దాళ్వా సక్రమంగా సాగి దిగుబడి బాగుంటుందని భావిస్తున్నారు. అల్పపీడన హెచ్చరికలతో ఆందోళన నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa