ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమలలో వీఐపీ దర్శనాలపై కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2024, 08:21 PM

శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మలయాళ నటుడు దిలీప్‌కు వీఐపీ దర్శనం కల్పించడంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దిలీప్ కోసం భక్తులను చాలాసేపు క్యూలెన్‌లో ఆపేయడంపై తీవ్రంగా పరిగణించింది. దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. తాజాగా, శబరిమలలో వీఐపీ దర్శనాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. శబరిమలలో భక్తులు ఎవరికీ ప్రత్యేక పౌకర్యం లేదని తేల్చిచెప్పింది. శబరిమల ఆలయ 18 మెట్ల ముందు యాత్రికులకు అంతరాయం లేకుండా ఉండాలనే నియమాన్ని నటుడు దిలీప్ డిసెంబరు 5న బహిరంగంగా ఉల్లంఘించారని హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ఇది చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు సహా యాత్రికుల హక్కులను ప్రభావితం చేసిందని పేర్కొంది.


‘యాత్రికులను ఏడు నిమిషాలకుపైగా క్యూలైన్‌లో నిలిపివేయడం.. చాలా తీవ్రమైన విషయం’ అని జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ ఎస్ మురళీకృష్ణల ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో శబరిమలలో పవిత్రమైన సోపానాల వద్ద భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్ పోలీస్ కో-ఆర్డినేటర్‌కు సూచించింది. నటుడు దిలీప్ వచ్చిన సమయంలో రికార్డైన సీసీటీవీ కెమెరా వీడియోను కోర్టు హాలులో వీక్షించిన న్యాయమూర్తులు.. సోపానం ముందు ఉన్న మొదటి వరుస ద్వారా యాత్రికుల రాకపోకలను రాత్రి 10:58:10 గంటలకు డ్యూటీలో ఉన్న భద్రతా సిబ్బంది దక్షిణం వైపు నుంచి అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.


దక్షిణం వైపు నుంచి పదునెట్టాబడికి చేరుకున్న నటుడు దిలీప్.. దర్శనం అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయే వరకూ మొదటి వరుసలో నిలబడి ఉన్న యాత్రికులను సన్నిధానంలోకి అనుమతించలేదు. ఇక, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) తరఫు లాయర్.. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ నివేదికను కోర్టుకు సమర్పించారు. దీనిపై ఇప్పటికు పాలనా అధికారి, అసిస్టెంట్ ఈఓ, ఇద్దరు భద్రతా సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీచేసినట్టు వివరించారు. ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ నటుడు దిలీప్‌ డిసెంబరు 5న శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయనకు టీడీబీ వీఐపీ దర్శనం ఏర్పాటు చేసింది. దీంతో భక్తులు చాలాసేపు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. మీడియాలో వచ్చిన కథనాలు ఆధారంగా కేరళ హైకోర్టు దీనిని సుమోటోగా తీసుకొని విచారించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com