మాలలకు జరిగిన అన్యాయాన్ని పార్లమెంటు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈనెల15న చేపట్టిన మాలల మహా గర్జనకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. ‘హలో మాల.. చలో గుంటూరు’ సభకు కనీసం ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. మేము ఏ రాజకీయ పార్టీకీ వ్యతిరేకంగా కాదు. మాలల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా మహాగర్జన ఏర్పాటు చేశామన్నారు. అమలాపురం ప్రెస్ క్లబ్లో శుక్రవారం జిల్లా స్థాయి మాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. మహా గర్జనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఆర్టికల్ 341ని సుప్రీంకోర్టు ఏవిధంగా వినియోగిస్తోందని ప్రశ్నించారు. పార్లమెంటులో జరగాల్సిన చర్చను సుప్రీంకోర్టు తీర్పుగా ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పాలకుల కుట్రపూరితంగానే ఎస్సీ వర్గీకరణ జరిగిందని ధ్వజమెత్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిగ వర్గాలకు చెందిన మాయావతి, అథవాలె, పాశ్వాన్ వంటి నాయకులు సైతం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకత ప్రకటించారని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా మనువాద సంస్కృతి నడుస్తోం దన్నారు. మాలమహానాడు నాయకుడు ఇసుకపట్ల రఘుబాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మాలల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సమావేశంలో సీనియర్ నాయకులు డీబీ లోక్, జంగా బాబూరావు, గెడ్డం సురేష్బాబు, పొలమూరి మోహన్బాబు, రేవు తిరుపతిరావు, పెనుమాల చిట్టిబాబు, నెల్లి లక్ష్మీపతి, కప్పల శ్రీధర్, ఉండ్రు ఆశీర్వాదం పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa