ఏలూరు నగరంలో శనివారం తెల్లవారు జామున జరిగింది. ఏలూరు త్రి టౌన్ సీఐ ఎస్ఐ కోటేశ్వ రరావు తెలిపిన వివరాల ప్రకారం. ఏలూరు ఓవర్ బ్రిడ్జి కింద 39వ పిల్లర్ వద్ద నివాసం ఉంటున్న షేక్ వెంకట కనకరాజు (45)కు భార్య నాగమణి ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించింది. అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కనకరాజు ఆటో నడిపేవాడు. ఏలూరు రూరల్ మండలం వెంకటాపురానికి చెందిన నాని అనే యువకుడు తరచుగా ఓవర్ బ్రిడ్జి కిందకు వచ్చి కనకరాజు పెద్ద కుమార్తె (12)ను వేధించేవాడు. తనకు ఇచ్చి పెళ్ళి చేయాలని లేదంటే ఎవరినో ఒకరిని చంపివేస్తానని బెదిరించేవాడు.
ఈ నేపథ్యంలో కనకరాజుకు, నానికి గొడవలు జరిగేవి. ఈ నేపధ్యంలో తమ పిల్లలను కాపాడుకోవడానికి ఆ ముగ్గురు పిల్లలను తీసుకుని ఉంగుటూరు మండలం నారాయణపురం వెళ్ళి అక్కడే ఉంటూ తాపీ పనులకు వెళ్తున్నాడు. ఈనెల 13వ తేదీ ఉదయం 39వ పిల్లర్ వద్ద అతను నివాసం ఉన్న నాగిరెడ్డి గం గలక్ష్మి ఇంటి వద్దకు వచ్చి ఉన్నాడు. తిరిగి సాయ ంత్రం వరకూ అక్కడే పడుకుని రాత్రి కూడా ఆ ఇంటి బయటే పడుకుని ఉన్నాడు. కనకరాజు వచ్చిన సంగతి నాని తెలుసుకుని శుక్రవారం రాత్రి ఆ ప్రాంతంలోనే సంచరించి కనకరాజు ఎక్కడ ఉన్నాడంటూ కొంతమందిని అడిగినట్లు చెబుతున్నారు. శనివారం తెల్లవారుజామున కనక రాజుతో నాని గొడవ పెట్టుకుని అతని కుమార్తెను ఇచ్చి పెళ్ళిచేయాలని బెదిరింపులకు పాల్పడి చివరకు కత్తితో పొడిచి హతమార్చి పరారీ అయ్యాడు. శనివారం ఉదయం ఈ సంఘటనపై ఆ ప్రాంత గ్రామ, వార్డు సంక్షేమ కార్యదర్శి (మహిళ పోలీస్) సిరిమళ్ళ నాగ దుర్గాభవానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రి టౌన్ సీఐ ఎస్ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. మరోవైపు నాని కోసం ప్రత్యేక బృందాలను గాలింపుల్లోకి దించారు. ఆదివారం శవపంచనా మా నిర్వహించి పోస్టు మార్టం నిర్వహించ నున్నారు. కనకరాజు బంధువులకు సమాచారం ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa